పడగ నీడ

ఈ రోజు మార్చి 22వ తారీకు 2020 సం|| ఈ రోజు భారతదేశం మొత్తం సమైక్యంగా కరోనా బాధితులకు సేవలందిస్తున్న వారిని support/ encourage చెయ్యటానికి, ప్రధాని పిలుపు మేరకు సాయంత్రం 5 గం. కు గంటలు మోగించడం, చప్పట్లు కొట్టడం ద్వారా తెలియ జేశారు. ఈ సమైక్యతకు కారణం ‘ప్రాణ భయం’. ఇదే రోజు ఇజ్రైలు విడుదల చేసిన ప్రకటనలో, ఈ కరోనా ముప్పు కేవలం వయసు పైబడిన వారికే అనీ, మిగిలిన వారికి ప్రాణభయంలేదని చెప్పింది. అంతే కాకుండా , ఈ వైరస్ ప్రతివారికీ సోకి తీరుతుందనీ, ఐతే మూడునుంచి నాలుగు నెలలలో అందరికీ ఈ వైరస్ కి ఇమ్యూనిటీ వచ్చేస్తుందనీ ప్రకటించింది.  ప్రకృతి తన పద్ధతిలో సవరణలు చేసుకుంటుంది అనికూడా ఆ ప్రకటనలో వెల్లడించారు. అది చూసి….

వేయి పడగల నీడ పవళించు వాడొకడు,
వేయి నాగుల నగలు ధరియించు వాడొకడు,
కటిన మి్ణాగులే సూత్రమగు వాడొకడు,
తానె నాగుగ నిలచి ఏలువాడొకడు!

నాగ పడగల పైన నర్తించు వాడొకడు,
నాగభూషణు డగుచు మోదించు నొకడు,
ఫణి వైరి యురముపై ఊరేగు వాడొకడు,
ఫణినె తనయుగ గలిగి మురియు వాడొకడు!

నాగులెరుగని వారు నాకాన లేరాయె,
నాగ సేవలు లేక లోకాలె లేవాయె,
నానాడు లోకాల మేలుకోరెడి నాగు,
నరుని మేలెంచునను ఎరుకె కరువాయె!

పెన్నాగు పడిగలే పదిలంబనెంచుచూ,
నిలవ నెంచిన పుడమి పుట్టినామయ్యా!
బుసల చిందిన చినుకు చిచ్చనెంచేము ,
బుడత జీవుల మమ్ము మన్నించు మయ్యా!

Leave a comment