కాల గణన

మహాభారతం – శాంతిపర్వం :

 కాల గణన గురించి ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భీష్మ పితామహుడు : వేదవ్యాసుడు తన కుమారుడైన శుకునకు వివరించిన క్రమాన్ని ఈ విధంగా తెలిపాడు                                     

                                పజ్జేనిమిది రెప్ప పాట్లు – ఒక కాష్ట

                                ముప్పై కాష్టలు            – ఒక కళ

                              మూడు వందల అరవై కళలు  – ఒక ముహూర్తం

                                ముప్పై ముహుర్తాలు – ఒక అహోరాత్రం

                                ముప్పై అహోరాత్రాలు  – ఒక మాసం

                                రెండు మాసాలు               – ఒక ఋతువు

                                ఆరు ఋతువులు    – ఒక సంవత్సరం

                        మూడు ఋతువులు  – ఒక ఆయనం – ఉత్తరాయణం/ అగ్ని/శుక్ల పక్షము   &

                                                                            దక్షిణాయనం /ధూమం /కృష్ణ పక్షము

                   “విద్వాంసులైన ” మానవులకు ఒక నెల  – పితరులకు ఒక రోజు

( ఇక్కడ “విద్వాంసులైన ”  అనే పదం వాడటాన్ని గమనించాలి. “రెప్పపాటు” తో మొదలైయ్యే కాల గణనం – సామాన్యులకు , విద్వాంసులకు – వేరుగా ఉంటుందని భావన చేయవలసి ఉంటుందేమో )

  మానవులకు ఒక సంవత్సరం  – దేవతలకు ఒక రోజు

 కృతయుగం   – 17,28,000    మానవ సంవత్సరాలు  – తపస్సు స్వభావంగా  కలిగి ఉంటారు

  త్రేతాయుగం  – 12,96,000       మానవ సంవత్సరాలు  – శ్రేష్టమైన జ్గ్యాన స్ఫూర్తి  స్వభావంగా

  ద్వాపర యుగం –  8,64,000     మానవ సంవత్సరాలు –  యగ్యం  స్వభావంగా

కలి  యుగం – 4,32,000 మానవ సంవత్సరాలు –  దోషాచరణము  స్వభావంగా  కలిగి ఉంటారు

  4  యుగాలు కలిస్తే   – ఒక మహాయుగం

                                          1000+1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, రాత్రి

యుగం ఆద్యంత భాగాలను – సంధ్య – సంధ్యాంశము – అంటారు. So,

                 కృతయుగం   – 1,44,000    మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము

      త్రేతాయుగం  – 1,08,000       మానవ సంవత్సరాలు  సంధ్య – సంధ్యాంశము

      ద్వాపర యుగం – 72,000     మానవ సంవత్సరాలు  సంధ్య – సంధ్యాంశము

    కలి  యుగం     –   36,000     మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము

My understanding : 

ఈ సంధ్య సంధ్యాంశాలు మొత్తంలో సగభాగం – సంధ్య & సగభాగం సంధ్యాంశముగా తీసుకుంటే మొత్తం కలియుగ కాలం 4,32,000లో  18,000 + 18,000 =36,000 సం||యుగసంధి కాలంగా స్వీకరించాలి.

 యుగం నాలుగు పాదాలుగా భావిస్తారు. కనుకనే – సంకల్పంలో ” కలియుగే ప్రధమ పాదే” అనటం వింటుంటాము. కలియుగం మొత్తాన్ని 4భాగాలు చేస్తే – మొదటిపాదం 1,08,000 మానవ సంవత్సరాలు అవుతుంది . శ్రీ కృష్ణ జననం  5,110 సంవత్సరాల పూర్వం అన్న కధనం ప్రకారం – మనం ఇంకా యుగసంధిలోనే ఉన్నాం అనుకోవాలి.  కృష్ణ జననం కలియుగంలో అయ్యే అవకాశం లేదు కనుక, అవతార సమాప్తి నుంచి లెక్కించాలి. కృష్ణఅవతార ఆయుఃప్రమాణం 125 సంవత్సరాలుగా చెబుతారు. కనుక కలి ప్రవేశం జరిగి 5000 సంవత్సరాలు కంటే ఎక్కువ కాదు.

              ఈ  యుగ సంధి కాలమే ఇంకా  13,000 వేల సంవత్సరాలు ఉన్నది. సంపూర్ణంగా కలి ప్రవేశించినపుడు – దోషాచారమే ధర్మంగా విరాజిల్లుతుంది . అందుకేనేమో – కలియుగంలో సదాచారం, దయా , ధర్మం – కేవలం భావనచేత పుణ్యఫలం లభిస్తుంది అని ఋషివాక్యం .                                                               

               నారాయణ నారాయణ నారాయణ     

Leave a comment