శ్రీ రామ ప్రాణ ప్రతిష్ట – అయోధ్య

22nd January 2024

శ్రీ రామచంద్ర మూర్తి భారత భూఖండం మీద త్రేతాయుగం లో అయోధ్య రాజధానిగా రాజ్యమేలుతున్న దశరధ మహారాజుకి పుత్రకామేష్టి యజ్ఞ ప్రసాదంగా ముగ్గురు సోదరులతో లభించాడు. శోకం తానూ గ్రహించి ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాడు. కలి ప్రవేశించిన ఐదు వేల సంవత్సరాల తర్వాత , అదే అయోధ్య లోని శ్రీ రామ జన్మ భూమిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట చేసి రామ రాజ్య వైభవం తో ఈ కలియుగాన్ని ప్రకాశింప చేయాలని, మానవులు పడే ఆరాటం …. జై శ్రీ రామ్

శ్రీ రాముడుద్భవించినాడు భరత భూమిలో ,
కలి బాధలు కడతేర్చగ – కనువిందుగ కదలి నేడు !!
శ్రీ రాముడుద్భవించినాడు భరత సీమలో !!

యుగ ధర్మము బోధ చేయ కాలమెంత నేర్చినా ,
మానవతను మదిన నిలిపి వసుధనె వైకుంఠమును జేయ !
శ్రీ రాముడుద్భవించినాడు భరత భూమిలో !!

సకల జీవ సౌభాగ్యమే పురుష భావ సారంబని ,
వసుధ జనులు జీవులన్నీ ఏకైక కుటుంబమంచు ,
సాటి రాని స్నేహంబున వసుధ వైభవించ నేడు-
శ్రీ రాముడుద్భవించినాడు భరత సీమలో !

శ్రీ రాముడుద్భవించినాడు భరత భూమిలో ,
కలి బాధలు కడతేర్చగ – కనువిందుగ కదలి నేడు !!
శ్రీ రాముడుద్భవించినాడు భరత సీమలో !!

Leave a comment