4th స్కంధము : ధృవుడి వంశములో అంగరాజు సంతానం లేకపోవటం వల్ల – పుత్రకామేష్టి చేసి ‘వేను’ అనే కొడుకుని కన్నాడు. ‘వేనుడు’ పరమ కిరాతకుడు.’దుష్టుడైన పుత్రుని భరించటం కంటే త్యజించటం ఉత్తమం’ అని – అంగరాజు ఒక నాటి అర్ధరాత్రి అందరిని వదలి వెళ్ళిపోతాడు. ఎంత ప్రయత్నించినా అతని జాడ తెలియక పోవటం వల్ల, ఋషులు వేనుడికి రాజ్యాభిషేకం చేస్తారు. వేనుడి కిరాతకత్వానికి రాజ్యాధికారం తోడై ప్రజా కంటకుడిగా మారిన వేనుడిని ఋషులు మందలించబోయి అవమానింపబడతారు. ప్రజాహితం కోసం ఋషులు వేనుడిని శపించటం వల్ల అతను మరణిస్తాడు. వేనుడి తల్లి ఆశరీరం పాడుకాకుండా తన యోగశక్తితో కాపాడుతుంది. కొంతకాలానికి ప్రజాక్షేమం కోసం ఋషులు వేనుడి వంశాన్ని ఉద్దరించడానికి అతని శరీరాన్ని ‘మధ్ధిస్తారు’. ముందుగా వేనుడి ఊరువులు (తొడలు) నుంచి ‘కిరాతుడు’ పుడతాడు. అతడే బోయ వంశాంకుతరం. వేనుడి ‘బాహువులు’ మధ్ధిం’చటం వల్ల – విష్ణాంశ సంభూతుడైన ‘ప్రుథు’వు , లక్ష్మీ అంశ గల పుత్రికా కలుగుతారు.
కనుక: దుష్టునికి దుష్ట సంతానం – శిష్టునికి మంచి సంతానం కలుగుతుందని చెప్పలేము.
🙏🏼