శ్రీ రామచంద్ర మూర్తి భారత భూఖండం మీద త్రేతాయుగం లో అయోధ్య రాజధానిగా రాజ్యమేలుతున్న దశరధ మహారాజుకి పుత్రకామేష్టి యజ్ఞ ప్రసాదంగా ముగ్గురు సోదరులతో లభించాడు. శోకం తానూ గ్రహించి ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాడు. కలి ప్రవేశించిన ఐదు వేల సంవత్సరాల తర్వాత , అదే అయోధ్య లోని శ్రీ రామ జన్మ భూమిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట చేసి రామ రాజ్య వైభవం తో ఈ కలియుగాన్ని ప్రకాశింప చేయాలని, మానవులు పడే ఆరాటం …. జై శ్రీ రామ్
శ్రీ రాముడుద్భవించినాడు భరత భూమిలో , కలి బాధలు కడతేర్చగ – కనువిందుగ కదలి నేడు !! శ్రీ రాముడుద్భవించినాడు భరత సీమలో !!
యుగ ధర్మము బోధ చేయ కాలమెంత నేర్చినా , మానవతను మదిన నిలిపి వసుధనె వైకుంఠమును జేయ ! శ్రీ రాముడుద్భవించినాడు భరత భూమిలో !!
సకల జీవ సౌభాగ్యమే పురుష భావ సారంబని , వసుధ జనులు జీవులన్నీ ఏకైక కుటుంబమంచు , సాటి రాని స్నేహంబున వసుధ వైభవించ నేడు- శ్రీ రాముడుద్భవించినాడు భరత సీమలో !
శ్రీ రాముడుద్భవించినాడు భరత భూమిలో , కలి బాధలు కడతేర్చగ – కనువిందుగ కదలి నేడు !! శ్రీ రాముడుద్భవించినాడు భరత సీమలో !!
కాల గణన గురించి ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భీష్మ పితామహుడు : వేదవ్యాసుడు తన కుమారుడైన శుకునకు వివరించిన క్రమాన్ని ఈ విధంగా తెలిపాడు
పజ్జేనిమిది రెప్ప పాట్లు – ఒక కాష్ట
ముప్పై కాష్టలు – ఒక కళ
మూడు వందల అరవై కళలు – ఒక ముహూర్తం
ముప్పై ముహుర్తాలు – ఒక అహోరాత్రం
ముప్పై అహోరాత్రాలు – ఒక మాసం
రెండు మాసాలు – ఒక ఋతువు
ఆరు ఋతువులు – ఒక సంవత్సరం
మూడు ఋతువులు – ఒక ఆయనం – ఉత్తరాయణం/ అగ్ని/శుక్ల పక్షము &
దక్షిణాయనం /ధూమం /కృష్ణ పక్షము
“విద్వాంసులైన ” మానవులకు ఒక నెల – పితరులకు ఒక రోజు
( ఇక్కడ “విద్వాంసులైన ” అనే పదం వాడటాన్ని గమనించాలి. “రెప్పపాటు” తో మొదలైయ్యే కాల గణనం – సామాన్యులకు , విద్వాంసులకు – వేరుగా ఉంటుందని భావన చేయవలసి ఉంటుందేమో )
మానవులకు ఒక సంవత్సరం – దేవతలకు ఒక రోజు
కృతయుగం – 17,28,000 మానవ సంవత్సరాలు – తపస్సు స్వభావంగా కలిగి ఉంటారు
త్రేతాయుగం – 12,96,000 మానవ సంవత్సరాలు – శ్రేష్టమైన జ్గ్యాన స్ఫూర్తి స్వభావంగా
ద్వాపర యుగం – 8,64,000 మానవ సంవత్సరాలు – యగ్యం స్వభావంగా
కలి యుగం – 4,32,000 మానవ సంవత్సరాలు – దోషాచరణము స్వభావంగా కలిగి ఉంటారు
4 యుగాలు కలిస్తే – ఒక మహాయుగం
1000+1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, రాత్రి
యుగం ఆద్యంత భాగాలను – సంధ్య – సంధ్యాంశము – అంటారు. So,
కృతయుగం – 1,44,000 మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము
త్రేతాయుగం – 1,08,000 మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము
ద్వాపర యుగం – 72,000 మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము
కలి యుగం – 36,000 మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము
My understanding :
ఈ సంధ్య సంధ్యాంశాలు మొత్తంలో సగభాగం – సంధ్య & సగభాగం సంధ్యాంశముగా తీసుకుంటే మొత్తం కలియుగ కాలం 4,32,000లో 18,000 + 18,000 =36,000 సం||యుగసంధి కాలంగా స్వీకరించాలి.
యుగం నాలుగు పాదాలుగా భావిస్తారు. కనుకనే – సంకల్పంలో ” కలియుగే ప్రధమ పాదే” అనటం వింటుంటాము. కలియుగం మొత్తాన్ని 4భాగాలు చేస్తే – మొదటిపాదం 1,08,000 మానవ సంవత్సరాలు అవుతుంది . శ్రీ కృష్ణ జననం 5,110 సంవత్సరాల పూర్వం అన్న కధనం ప్రకారం – మనం ఇంకా యుగసంధిలోనే ఉన్నాం అనుకోవాలి. కృష్ణ జననం కలియుగంలో అయ్యే అవకాశం లేదు కనుక, అవతార సమాప్తి నుంచి లెక్కించాలి. కృష్ణఅవతార ఆయుఃప్రమాణం 125 సంవత్సరాలుగా చెబుతారు. కనుక కలి ప్రవేశం జరిగి 5000 సంవత్సరాలు కంటే ఎక్కువ కాదు.
ఈ యుగ సంధి కాలమే ఇంకా 13,000 వేల సంవత్సరాలు ఉన్నది. సంపూర్ణంగా కలి ప్రవేశించినపుడు – దోషాచారమే ధర్మంగా విరాజిల్లుతుంది . అందుకేనేమో – కలియుగంలో సదాచారం, దయా , ధర్మం – కేవలం భావనచేత పుణ్యఫలం లభిస్తుంది అని ఋషివాక్యం .
మహాభారతం శాంతి పర్వం :భీష్ముడు ధర్మరాజుతో : తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని వేరే జన్మలలో సంచరిస్తున్న బలి చక్రవర్తి ఇంద్రుడి ప్రశ్నకు : యగ్యాలు, వ్రతాలు నిర్వహించటం , శీలవంతుడై జీవించడం వంటి విషయాలు కాలగతిని మార్చలేవు . కాలగతికి అవి కారణాలు కాజాలవు అని సమాధానం ఇచ్చాడు.
కాల గతులే గతులు – శూలికైన తమ్మిచూలికైనా !
రూపు గట్టిన పురుషుడందె కన్నియ రూపు,
రూపమెరుగనివాడు అంబికా పతి ఆయె !
కాలు మించినవారు కానరారు వినరారు ,
కాల గతులే గతులు – శూలికైన తమ్మి చూలికైనా !!
కశ్యప ప్రజాపతి భార్యలు – దితి , అదితి .
దితి – సంతానం దైత్యులు
అదితి : సంతానం అమరులు / దేవతలు
ప్రహ్లాదుడి మనుమడైన బలిచక్రవర్తి ని అణిచి – ఇంద్రుడికి సింహాసనం ఇచ్చాడు శ్రీమహావిష్ణువు
దితి తపః ఫలముగా ఉదయించినా రాజు ,
అదితి సంతును కూల్చి అమరలోకము మెట్టి,
విబుధ జన సేవలను ఎంతగా చేసినా,
సురలోక వంద్యున్డు మన్నించ లేదే!!
మరుగుజ్జు యైబుట్టి మహిమ లెన్నోజూపి,
అగ్రజుడె అధికుడని దితిపుత్రు నణగించి ,
యశము గాంచినవాని ఏమంచు మన్నింతు?
కాల గతులే గతులు ఏ కాలమందైన ,
కటిక సత్యమనెరిగి మౌనమొందికను!!
స్వర్గం లో ఉన్న పాండురాజుకి ” రాజసూయం” చేయటం వల్ల బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది అని తెలిసి , నారద మునీంద్రుడి ద్వారా ధర్మరాజుకు “రాజసూయ యాగం” చేయవలసిందిగా కబురు పెట్టాడు. రాజసూయ యాగం వలన అపారమైన జన నష్టం జరుగుతుంది అని తెలిసీ, తండ్రి కోరిక మేరకు ధర్మరాజు ఆ మహా యజ్జ్యం చేసాడు
ఈ భూమికి వచ్చే ప్రతి జీవికి తగిన వసతి కలిగించి గౌర వీస్తుంది భూమి . ఆ వసతి కేవలం ఈ భూమికే పరిమితం. అది ఏ నాడు సొంతం కాదు. భూమి అన్నింటిని recycle చేస్తూనే ఉంటుంది, దానికి తరుగు లేదు, పెరుగుదలా లేదు.
నీదికానీ వసతి తగిలించు బంధాలు , బంధనాలై నిన్ను బాధించుచున్నా, మరలనెంచని మనసు మారాము నాలించి , మరచి మాధవు నీవు మననెంచ నెలా ?
అచ్చరలు కిన్నెరలు అమరేంద్ర పాలితులు , అలక అలుపులు దీర విడిది నెంచెడి నెలవు, సుడులు తిరుగుచు తాను సూర్య చంద్రుల వెంట , పరుగు నెచటికో తాను పయనించు నెలవు !!
చేరవచ్చెడి వారి నాదరించగ తాను , తన తనువు చీల్చుకొని వసతిచ్చు నెలవు, కొలువుండు కాలాన తన సోయగములన్ని , కొసరి కుడుపుచు మరుల నందించు నెలవు!
ఈ కవిత 1980 ప్రాంతంలో రాసుకున్నది , math notebook చివరి page లలో రాసుకున్నది. ఆ పుస్తకం జాగ్రత్త చేసేడు నా పెద్ద తమ్ముడు … జీవితంలో నేను ఎంత ఎదిగానో ఎదో ఒక రోజు చూసుకుంటాను అనుకున్నాడేమో ..
కనిపించే ఈ లోకం – కనిపించని ఆ లోకం, కలలోనే కవ్వించే కమ్మనైన సుమ రూపం, నాలోనే ఒదిగుందట – ఎదిగిందట నాలోనే !!
ఈ కవిత నేను డిగ్రీ చదివే రోజులది (1970-80) అయుండాలి. ఆ పుస్తకం ఆఖరి పేజీ లో ఉంది. ఈ పాత కవితలు చూసినప్పుడు , మా తమ్ముడు వీటిని ఎందుకు నా పుస్తకాలు వెతికి వెతికి వీటిని జాగ్రత్త చేశాడా , అనిపిస్తుంది. ఆ కవితలు నేను ఎదగ లేదు అని నాకు చెబుతున్నట్టు అనిపిస్తుంది ……